పోస్ట్‌లు

2020లోని పోస్ట్‌లను చూపుతోంది

Short film opportunity without any fee

చిత్రం
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdQ1c3MORIS7xn83A7lkcdeAcstK-7u5zlMbJ-RfdmgdLdq7g/viewform If you interested act in Short film... Do you want Short film opertunity... Then you apply for auditions through the Link There is no fee to apply It's always free Oppertunity also always free  *Great opportunity to act in a short film at no charge*  #shortfilmchance #offer no fee... great opportunity to work in the short film.   Wanted actors (Male/Female) for a role in the Shortfilm wanted cast and crew in the Short film. We give the chance in all fields related to the Shortfilm. That means director, cameramen, dubbing artist, editor, writers, music directors etc. If you want to take this opportunity.....  Just contact us... NVR entertainments  Contact us for more details Contact Us ... WhatsApp number: 7729013094 Facebook: https://www.facebook.com/nvrentertainments1/ Instagram: https: //www.instagram. com / nvrentertainments / YouTube: https://www.youtube.com/channel/UC7K1OTWQC3

Our New Short film

చిత్రం
#ANK #nvrentertainments Tittle announced on July 10th Producer: Amarapalli Narayana Director: N Venkat Raghava Camera: K Surya Kiran Family Drama

Donate a meal for NEEDY foundation - phase 2

చిత్రం
ఎవ్వరికి ఎప్పుడు ఏ రూపం లో కష్టం వస్తుందో ఎవ్వరికీ తెలీదు.... రోజు కూలీ చేసుకుంటూ, తమ కష్టార్జితాన్ని నమ్ముకుని, పూట గడుపుకునే నిర్భాగ్యులు... ఆత్మాభిమానం తో బ్రతికే సాటి మనుషులు.... పాపం వారికేం తెలుసు... అలాంటి వారి జీవితాల్లోకి కరోనా మహమ్మారి రూపంలో ఎన్నడూ గ్రహించనీ ఆకలి బాధలను తెస్తుందని..! పాపం వారికేం తెలుసు.. గృహ నిర్భంధం సమాజ క్షేమం కోసం అయినా, వారి బ్రతుకులను దుర్బరం చేస్తుందని...!! అది *అనపర్తి దగ్గర రామవరం అనే గ్రామం...అక్కడ అందరూ రోజు కూలీలు, శ్రామికులు*... *వారికి కరోనా మహమ్మారి ఆకలి బాధలను  తెస్తుందని ఎప్పుడూ అనుకోలేదు....* *వారి ఆకలి బాధలను తెలుసుకుని Phase- 2 గా అక్కడ ఉండే 130 మంది కూలీలకు ఈరోజు మన డైట్ కామ్రెడ్స్ తరపున ఆకలి తీర్చడం జరిగింది* దీనికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరునా ధన్యవాదాలు ... 🙏🙏🙏

DONATE a meal for NEEDY- phase 1

చిత్రం
కరోనా మహమ్మారి వలన పస్తులుంటున్న ఎందరో పేదవారికి, అగ్గి లాంటి ఎండ ధాటికి ఎటు పోవాలో తెలీని..నిలువ నీడ లేని నిర్భాగ్యులకి, ఇప్పుడు తింటే మళ్లీ ఎప్పుడు తింటామో తెలియని అభాగ్యులకి, దేశ సేవ లో నిమగ్నమైన పోలీసులకి, sanitary సిబ్బందికి, *Phase - 1గా  ఈరోజు మన డైట్ కామ్రేడ్స్ తరపున ఒక చిన్న ప్రయత్నం ద్వారా రాజమండ్రిలో  28 మందికి వెజ్ బిర్యాని, ఆలూ కుర్మా, మజ్జిగ, బిస్కెట్ పాకెట్స్ అందించడమైనది* ఏమని చెప్పగలం, ఎంతని చెప్పగలం... *ఈపూట బానే గడిచింది అని సంతోష పడుతూనే, ఇంకొక పూట ఎలా గడుస్తుందో అని బాధ పడుతున్న అభాగ్యులు ఎందరో ఉన్నారు..* *తమ కష్టాన్ని నమ్ముకున్న రోజు వారి కూలీలు, ఆత్మాభిమానం తో బ్రతికే కార్మికులకు మాత్రం ఏం తెలుసు ఇటువంటి గడ్డు కాలం వస్తుందని...*! *తమ ఆకలి తీర్చడానికి ఎవరో వస్తారు..తినడానికి ఏదో ఇస్తారు అని ఆత్మాభిమానాన్ని చంపుకుని  ఎదురు చూసే రోజులను తెస్తుందని...*!! ఆకలి వల్ల ఆత్మాభిమానాన్ని చంపుకున్న వారు కొందరైతే, ఆత్మాభిమానాన్ని చంపుకోలేక ఆకలితో బాధ పడే వారు ఇంకొందరు.... వీళ్లంతా ఎక్కడో ఉన్నారు అనుకుంటున్నారా... ఎక్కడో కాదు..  ఈ *

donate a meal for NEEDY... thanks

🌱🌱🌱 మేము చేపట్టిన ఈ *Donate a meal* కార్యక్రమానికి మీ స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.. *మీ స్పందన ఖచ్చితంగా ఎంతో మంచి అన్నార్తుల ఆకలి తీర్చుతుంది* విద్యార్థులుగా మేము చేస్తున్న  ఈ మొదటి ప్రయత్నానికి తమ వంతు  సహాయంతో పాటు ప్రోత్సాహాన్ని అందిస్తున్న *బంధు మిత్రులకు, మాలో మానవతా విలువలు నింపిన ఉపాధ్యాయులకు, ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు* తెలుపుతున్నాము. 🙏🙏🙏 మీరు కూడా మీకు తోచిన సహాయం చేయండి.. మనమందరం కలిసి కొంత మంది ఆకలినైన తీర్చుదాం..   మనిషికి రూపం మానవత్వమే అని మరొక్కసారి నిరూపిద్ధాం.. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మన దేశం ఉన్నప్పుడు, ఒకరి కడుపు నింపడం *దేశ పౌరులుగా* గా మన బాధ్యత.. ఇదే మానవ సేవ, దేశ సేవ 🌱🌱🌱

DONATE A MEAL FOR NEEDY CONCEPT

మిత్రులకు మనవి...🙏🙏🙏 కరోనా వైరస్ తో బాధపడే వారి కంటే, ఈ వైరస్ ప్రభావంతో లాక్ డౌన్ వల్ల పూట గడవక ఆకలితో బాధపడే వారి సంఖ్య ఎక్కువయ్యింది. అందుకోసం కొంత మందికైనా ఆకలిని తీర్చి, కడుపు నింపే ప్రయత్నంగా *భోజన పంపిణీ* కార్యక్రమాన్ని  చేపడుతున్నాం.. ఈ కార్యక్రమంలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం.. నీ సహాయం చిన్నదైనా, ఆ చిన్న సహాయం కోసం అల్లాడిపోతున్న ప్రాణాలెన్నో... ఇందుకు సాయంగా మీరు ఒక్క రూపాయి దానం చేసినా చాలు... ఎందుకంటే, ఇక్కడ సహాయం చేసేది .. నువ్వు కాదు "మనం - మనమందరం" మనం చేసే ఈ సహాయం ఎంతోమంది  *అనాధలు, వృద్ధులు, కార్మికుల* కడుపులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.. మీరు గూగుల్ పే/ ఫోన్ పే ద్వారా మీ సహాయాన్ని అందించవచ్చు.. గూగుల్ పే/ ఫోన్ పే నంబర్: 9121749499 Bank Name: Andhra Bank A/c no: 094110100050349 Branch: RAMAVARAM IFSC code: ANDB0000941 ఆర్గనైజేషన్ చేయువారు:  డైట్ బొమ్మూరు, 2017-19 బ్యాచ్ ఛాత్రోపాధ్యాయులు Contact numbers: 7997292264 ,  9347750021 "ప్రార్థించే పెదవుల కన్నా , సహాయం చేసే చేతులు మిన్న" 🌱🌱🌱

కొనసాగుతున్న భోజన పంపిణీ

చిత్రం
రాజమండ్రి: కరోనా వైరస్ దృష్ట్యా గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. ఈ లాక్ డౌన్ వల్ల రోజూ కూలీలు, నిరాశ్రయులు, అనాధలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది. దీనిని గమనించిన డైట్ బొమ్మూరు పూర్వ విద్యార్థులు వారి ఆకలి తీర్చేందుకు, భోజన పంపిణీ కార్యక్రమం చేపట్టారు. అయితే, ఈ కార్యక్రమం గత కొద్ది రోజులుగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో DONATE A MEAL FOR NEEDY పేరుతో జరుగుతుంది. తాజాగా సోమవారం రాజమండ్రి లో ఆకలి తో బాధపడుతున్న నిరాశ్రయులకు, అనాధలకు, కార్మికులకు భోజన పంపిణీ చేసినట్లు డైట్ పూర్వ విద్యార్దులు హరీష్, వెంకట్ రాజు తెలిపారు. విరాళాలు సేకరించి ఈ కార్యక్రమం చేస్తున్నామని, అందరూ చాలా బాగా సహకరిస్తున్నారని, ఈ కార్యక్రమం మాకు ఎంతో తృప్తిని ఇస్తుంది అని వారు అన్నారు.

DONATE A MEAL FOR NEEDY TEAM - THANKS TO JVS BHASKAR

చిత్రం
JVS BHASKAR about DONATE A MEAL మేము చేస్తున్న DONATE A MEAL FOR NEEDY కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తూ, మరింత విజయవంతం కావాలని, మోటివేషనల్ స్పీకర్ (Impact) శ్రీ జె.వి.యస్ భాస్కర్ గారు తన కొత్త యూట్యూబ్ చానల్ ద్వారా వ్యక్తం చేశారు. మనం చేస్తున్న మంచి పనికి ఇంత గొప్ప ఆదరణ లభించడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఇదే ఉత్సాహంతో మరింత మంది కడుపు నింపే ప్రయత్నం చేస్తాము. మీ అందరి సహకారం వల్లే, మేము ఈ కార్యక్రమం విజయవంతం చేయగలుగుతున్నాము. ఇకపై కూడా ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే మరింత మంది సహకారం అవసరం. అందుకోసం మనం ఈ విషయాన్ని మరింత మందికి షేర్ చేసి, *అన్నార్తుల ఆకలి తీర్చుదాం... కూలీల కడుపులు నింపుదాం...* మానవత్వమే మనిషికి రూపం.. మనిషి గా మరో మనిషికి సాయం చేద్దాం... YouTube  అన్నార్తులను ఆదుకుందాం... మానవత్వం చాటుకుందాం... 🙏🙏🙏 Please support us...

DONATE A MEAL FOR NEEDY

చిత్రం
కరోనా వైరస్ తో బాధపడేవారికంటే, దాని ప్రభావం తో పూట గడవక ఆకలితో బాధపడే వారి సంఖ్య ఎక్కువైంది.  లాక్ డౌన్ కారణంగా మనం ఎవ్వరం, బయటకు రావడం లేదు... ఏ పనీ చేయటం లేదు... దీనివల్ల అన్నార్తులు, అనాధలు, రోజూ కూలీలు, నిరాశ్రయులు తిండి లేక ఆకలితో అల్లాడుతున్నారు.  ఇటువంటి దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్న వారి కడుపు నింపేందుకు చేస్తున్న కార్యక్రమమే, DONATE A MEAL FOR NEEDY కేవలం మేము మాత్రమే దీనిని విజయవంతం చేయలేము... దీనికి మీ అందరి సహకారం కావాలి... 🙏🙏🙏 మీరు చేసే సహాయం ఎంతో మంది అనాధలు, వృద్ధులు, కార్మికుల కడుపులు నింపుతుంది...   సహాయం చేద్దాం ఇలా:- Google Pay/ phone Pay number: 9121749499 Bank name: Andhra Bank A/c no: 094110100050349 Branch: RAMAVARAM IFSC Code: ANDB0000941   సంప్రదించండి ఇలా:- 7997292264 (రాజశేఖర్) , 9347750021 (త్రినాథ్) https://youtu.be/vgtqccw4Iuw

డోలీ మోతకు చెక్

చిత్రం
విశాఖ ఏజెన్సీ: విశాఖపట్నం జిల్లాలో సగభాగం ఏజెన్సీ ప్రాంతమే. జిల్లాలో పాడేరు ఐటీడీఏ పరిధిలో 11 గిరిజన మండలాల్లో 245 పంచాయతీలు, వాటిలో 4,210 గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ మారుమూల గిరిజన గ్రామాలే. చాలా గ్రామాలు కొండల్లో ఎక్కడెక్కడో ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో సౌకర్యాలు ఉండవు. మరికొన్ని గ్రామాల్లో మార్గమే లేని పరిస్థితి. ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ బ్రతుకుతున్నారు అమాయక గిరిజన ప్రజలు. ఈ గిరిజన ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఎక్కువ. చెప్పాలంటే కొన్ని కొన్ని గ్రామాల్లో పాఠశాల సదుపాయం కూడా లేదు. కొన్ని గ్రామాల్లో ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రికి వెళ్ళాలన్నా, బాలింతలను తీసుకుని వెళ్ళాలన్నా డోలీ కట్టి మోసుకుని వెళ్ళాల్సిందే. ఈ  డోలీలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటువంటి గ్రామాల్లో నివశించే గిరిజన ప్రజల చిరకాల వాంఛ "రోడ్డు".  అనేక సార్లు ఎన్నో గ్రామాల గిరిజన ప్రజలు అధికారులను, ప్రజా ప్రతినిధులను మా గ్రామానికి దారి చూపండి అంటూ రోడ్డు కావాలని అడిగారు, వినతి పత్రాలు సమర్పించారు. ఇప్పటికీ అడుగుతున్నారు, వినతి పత్రాలు

పరీక్షలకు వేళాయెరా....

విశాఖ ఏజెన్సీ: విద్యా సంవత్సరం చివరిదశకు వచ్చేసింది. విద్యార్థులు ఈ సంవత్సరం ఏం నేర్చుకున్నారో పరీక్షించుకని, వారి సామర్థ్యాన్ని తెలుసుకునే సమయం ఆసన్నమైంది. దాదాపుగా అన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తి కావస్తోంది. కళాశాలల్లో అయితే సిలబస్ పూర్తి చేసి ఉంటారు. మరికొద్ది రోజుల్లో పదవతరగతి పిల్లలు, వారి జీవితం లో మెదటి పబ్లిక్ పరీక్షలు ఎదుర్కొనబోతున్నారు. అతి త్వరలో పరీక్షలు కావడంతో, పదవతరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులు పరీక్షలకు సిద్ధం అవుతున్నారు. సమయం వృధా చేయకుండా, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. దాదాపుగా అన్ని కోర్సుల వారికి పరీక్షలకు వేళాయెను. కానీ, డి.ఎడ్ చదివే వారికి మాత్రం ప్రాక్టికల్ పరీక్షలు, పబ్లిక్ పరీక్షలు సక్రమంగా నిర్వహించడం లేదు. కాబోయే ఉపాధ్యాయులు అయిన డి.ఎడ్ విద్యార్థులు విద్యాశాఖకు ఎన్ని ఫిర్యాదులు చేసినా, సక్రమంగా పరీక్షలు నిర్వహించడం లేదని ఛాత్రోపాధ్యాయులు వాపోతున్నారు.

కాలం రాబోతోంది...

చిత్రం
NVR entertainments విశాఖ ఏజెన్సీ: విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో దిగువ ప్రాంత ప్రజలు ఎక్కువ మంది వేసవి కాలాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నారు. వేసవి కాలం లో పండే "జీడి మామిడి" పంట వీరికి ప్రధానమైనది చెప్పవచ్చు. జీడి మామిడి పంట పై ఆధారపడి చాలా కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. ఈ వేసవిలో సంపాదించిన దానితోనే సంవత్సరం మొత్తం గడుపుతారు. దళారీల వద్ద అప్పులు చేసి గిరిజన ప్రజలు బ్రతుకుతున్నారు. 2018 వరకు వీరి జీవనం బాగానే గడిచింది. గత ఏడాది జీడి పిక్క ధర అందరినీ నిరాశ పరిచింది. ఎన్నో కుటుంబాలు అప్పులపాలై గడుపుతున్న పరిస్థితి ప్రస్తుతం విశాఖ మన్యం దిగువ ప్రాంతంలో కనిపిస్తుంది. జీడిపప్పు ధర ఆకాశాన్ని తాకుతున్న, జీడిపప్పు ఉండే పిక్క ధర మాత్రం గత ఏడాది జీడి మామిడి రైతులు అందరినీ నిరాశ పరిచింది. దీనికి కారణం గత ఏడాది ఏప్రిల్- మే నెలల్లో ఎన్నికలు కారణంగా ప్రభుత్వం లేకపోవడం వలన అని అభిప్రాయపడి, మల్లీ ఈ సంవత్సరం కూడా జీడి మామిడి పంట సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు దిగువ ఏజెన్సీ రైతులు. "రైతు దేశానికి వెన్నెముక అంటారు" కానీ, ఆ రైతుల కష్టాలు మాత్రం ఎవ్వర

మద్యం పై కన్నెర్ర

చిత్రం
విశాఖ ఏజెన్సీ: విశాఖపట్నం జిల్లా మన్యం లో చాలా కాలం నుంచి దాదాపుగా అన్ని ప్రాంతాల్లో నాటుసారా తయారీ చేస్తున్నారు. దీనిపై మన్యం లో పలు గ్రామాల్లో సోమవారం దాడులు నిర్వహించి, పాత్రలు స్వాధీనం చేసుకున్నారు. పాడేరు లో ఎక్సైజ్ సిఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మినుములూరు పంచాయతీ లో దాడులు నిర్వహించి, ఎక్సైజ్ సిబ్బంది 1900 లీటర్ల బెల్లపు పులుపు ధ్వంసం చేశారు. కొయ్యూరు మండలం కొమ్మిక పంచాయతీ లో ఎస్సై నాగేంద్ర ఆధ్వర్యంలో  మహిళా పోలీస్, స్వయం సహాయక సంఘ సభ్యులు, వాలంటీర్లు దాడులు నిర్వహించారు. 25 లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఎస్సై తెలిపారు.ఇది ఇలా ఉంటే, తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు లో అక్రమ మద్యం విక్రయాలు జరుపుతున్న వారి ఆటకట్టించారు ఓ మహిళా పోలీస్ అధికారిని. సముద్ర తీరంలోని కరువాక గ్రామంలో అనధికార మద్యం హల్ చల్ చేస్తోంది. విషయం తెలుసుకున్న సచివాలయ మహిళా పోలీస్ అధికారిని సోమవారం ఆ ఇంటి పై దాడి చేసి మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఎవరు అడ్డం వచ్చిన లెక్క చేయకుండా  ఎదురించి మరీ దాడి చేశారు మహిళా పోలీస్ అధికారిని ధన్యశ్రీ. అండగా నిలిచిన సచివాలయ సిబ్బంది. 22 మద్య

షార్ట్ ఫిల్మ్ అవకాశం

చిత్రం
NVR entertainments ఎటువంటి ఫీజు లేకుండా షార్ట్ ఫిల్మ్ లో నటించే గొప్ప అవకాశం #shortfilmchance #offer ఎటువంటి ఫీజు లేకుండా షార్ట్ ఫిల్మ్ లో నటించే గొప్ప అవకాశం షార్ట్ ఫిల్మ్ లో నటించేందుకు నటీ నటులు కావలెను షార్ట్ ఫిల్మ్ కి సంబంధించిన అన్ని రంగాల్లో అవకాశం కల్పిస్తున్నాం. అనగా డైరెక్టర్, కెమెరామెన్, డబ్బింగ్ ఆర్టిస్ట్, ఎడిటర్, రచయితలు, సంగీత దర్శకులు  మొదలైన అన్ని రంగాలవారికి అవకాశం కల్పిస్తున్నాం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాం..... ఎన్ వి ఆర్ ఎంటర్టైన్మెంట్స్ వివరాలకు మిమ్మల్ని సంప్రదించండిప్రదించండి Contact us... WhatsApp number: 7729013094 Facebook:  https://www.facebook.com/nvrentertainments1/ Instagram:  https://www.instagram.com/nvrentertainments/ YouTube:  https://www.youtube.com/channel/UC7K1OTWQC3l4I_TJXsglfoQ LinkedIn:  https://www.linkedin.com/in/nvr-entertainments-4839601a0 Pinterest:  https://in.pinterest.com/nvrmakings/ Email:  venkatraghava17@gmail.com Website blog:  http://nvrentertainments.blogspot.com Tik

ధారమఠం జలపాతం

చిత్రం
ధారమఠం పుణ్య క్షేత్రం మహా శివుని ఆలయం థారమఠం జలపాతం విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం లో ఈ జలపాతం ఉంది.

రాత్రి బడులు నిర్వహించాలి

చిత్రం
విశాఖ ఏజెన్సీ: విశాఖపట్నం జిల్లా కొయ్యూరు మండలం కొమ్మిక గ్రామస్తులు రాత్రి బడులు నిర్వహించాలి అని గ్రామ సచివాలయం లో వినతి పత్రం సమర్పించారు. ఆధునిక ప్రపంచంలో గ్రామాలు అభివృద్ధి చెందాలంటే కనీస విద్యా పరిజ్ఞానం కలిగి ఉండాలి. కొమ్మిక పంచాయతీ లో ఎక్కువ మంది నిరక్షరాస్యులే ఉన్నారు. అందువల్ల నిరక్షరాస్యులు అయిన మహిళలు, యువకులు, వృద్ధులకు రాత్రి బడులు నిర్వహించి వారికి విద్య పై అవగాహన కల్పించాలని, నిలిపి వేసిన సాక్షర భారత్ ను పునర్వ్యవస్థీకరణ చేయాలని గ్రామస్తులు  కోరుతున్నారు. వినతి పత్రం తీసుకున్న గ్రామ సచివాలయం సిబ్బంది పై అధికారులకు తెలియజేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు గ్రామస్తులు పాల్గొన్నారు. వివిధ వార్తా పత్రికల్లో....