కొమ్మిక లో 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈ సందర్భంగా పతాక ఆవిష్కరణ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కొమ్మిక గ్రామం లో తొలిసారిగా ఈ గణతంత్ర దినోత్సవం చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. దైవ సమానులైన చిన్న పిల్లలతో జాతీయ పతాక ఆవిష్కరణ చేయించారు. భారతీయ పౌరులైన మన అందరం దేశభక్తి ని కల్గి ఉండాలి అని వాలంటీర్ రాజు బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు. https://youtu.be/OaIpjm8sDEI https://youtu.be/OaIpjm8sDEI
NVR entertainments విశాఖ ఏజెన్సీ: విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో దిగువ ప్రాంత ప్రజలు ఎక్కువ మంది వేసవి కాలాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నారు. వేసవి కాలం లో పండే "జీడి మామిడి" పంట వీరికి ప్రధానమైనది చెప్పవచ్చు. జీడి మామిడి పంట పై ఆధారపడి చాలా కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు. ఈ వేసవిలో సంపాదించిన దానితోనే సంవత్సరం మొత్తం గడుపుతారు. దళారీల వద్ద అప్పులు చేసి గిరిజన ప్రజలు బ్రతుకుతున్నారు. 2018 వరకు వీరి జీవనం బాగానే గడిచింది. గత ఏడాది జీడి పిక్క ధర అందరినీ నిరాశ పరిచింది. ఎన్నో కుటుంబాలు అప్పులపాలై గడుపుతున్న పరిస్థితి ప్రస్తుతం విశాఖ మన్యం దిగువ ప్రాంతంలో కనిపిస్తుంది. జీడిపప్పు ధర ఆకాశాన్ని తాకుతున్న, జీడిపప్పు ఉండే పిక్క ధర మాత్రం గత ఏడాది జీడి మామిడి రైతులు అందరినీ నిరాశ పరిచింది. దీనికి కారణం గత ఏడాది ఏప్రిల్- మే నెలల్లో ఎన్నికలు కారణంగా ప్రభుత్వం లేకపోవడం వలన అని అభిప్రాయపడి, మల్లీ ఈ సంవత్సరం కూడా జీడి మామిడి పంట సీజన్ కోసం ఎదురుచూస్తున్నారు దిగువ ఏజెన్సీ రైతులు. "రైతు దేశానికి వెన్నెముక అంటారు" కానీ, ఆ రైతుల కష్టాలు మాత్రం ఎవ్వర
విశాఖ ఏజెన్సీ: విశాఖపట్నం జిల్లాలో సగభాగం ఏజెన్సీ ప్రాంతమే. జిల్లాలో పాడేరు ఐటీడీఏ పరిధిలో 11 గిరిజన మండలాల్లో 245 పంచాయతీలు, వాటిలో 4,210 గ్రామాలు ఉన్నాయి. ఇవన్నీ మారుమూల గిరిజన గ్రామాలే. చాలా గ్రామాలు కొండల్లో ఎక్కడెక్కడో ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో సౌకర్యాలు ఉండవు. మరికొన్ని గ్రామాల్లో మార్గమే లేని పరిస్థితి. ఇంతటి ఘోరమైన పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ బ్రతుకుతున్నారు అమాయక గిరిజన ప్రజలు. ఈ గిరిజన ప్రాంతాల్లో నిరక్షరాస్యత ఎక్కువ. చెప్పాలంటే కొన్ని కొన్ని గ్రామాల్లో పాఠశాల సదుపాయం కూడా లేదు. కొన్ని గ్రామాల్లో ఏదైనా ప్రమాదం జరిగి ఆసుపత్రికి వెళ్ళాలన్నా, బాలింతలను తీసుకుని వెళ్ళాలన్నా డోలీ కట్టి మోసుకుని వెళ్ళాల్సిందే. ఈ డోలీలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా గ్రామాల్లో ఇప్పటికీ కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇటువంటి గ్రామాల్లో నివశించే గిరిజన ప్రజల చిరకాల వాంఛ "రోడ్డు". అనేక సార్లు ఎన్నో గ్రామాల గిరిజన ప్రజలు అధికారులను, ప్రజా ప్రతినిధులను మా గ్రామానికి దారి చూపండి అంటూ రోడ్డు కావాలని అడిగారు, వినతి పత్రాలు సమర్పించారు. ఇప్పటికీ అడుగుతున్నారు, వినతి పత్రాలు
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి