విశాఖ ఏజెన్సీ: తూర్పు గోదావరి జిల్లా లోని ఓ అధ్యాపకుడు గణిత విన్యాసం ద్వారా అందరినీ అలరించారు. జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్),బొమ్మూరు (రాజమహేంద్రవరం) కు చెందిన ఈ అధ్యాపకులు ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న ఛాత్రోపాధ్యాయులకు గణితం బోధిస్తూ, గణితం లో తనదైన ప్రత్యేకతను చూపించి అందరినీ అబ్బుర పరుస్తారు. తాజాగా ఆయన కొత్త సంవత్సరం 2020 కి సంబంధించి చేసిన ఈ గణిత అలంకారం అందరినీ ఆకట్టుకుంటుంది. 12³+√4+56+(78×√9)=2020 1+2+345×6-7×8+√9=2020 2⁽¹⁺²⁺³⁺⁴⁺⁵⁺⁶⁺⁷⁻⁽⁸⁺⁹⁾-(1+2+3+4+5+6+7)=2020 వరుస అంకెల మధ్య గణిత గుర్తులు ఉపయోగించి పరిక్రియ జరిపిన తర్వాత 2020 వచ్చేలా అంకెలు, గుర్తులు అమర్చి, గణిత ప్రియులను ఉత్సాహపరిచారు. గణితం పట్ల ఆయనకు ఉన్న ఇష్టాన్ని గణిత విన్యాసాలు ద్వారా చూపుతున్నారు. అంతే కాకుండా ఈయన తయారు చేసిన గడియారం అందరినీ ఆలోచింపచేసింది. 2020 లో గల 2,0,2,0 అంకెలను వరుసగా వచ్చేలా తీసుకుని గణిత గుర్తులు ఉపయోగించి వాటి మధ్య పరిక్రియ జరిపితే గడియారం లో ఉండే 1,2,3,4,5,6,7,8,9,10,11,12 వచ్చేలా అంకెలు, గుర్తులు అమర్చి గడియారం - 2020 ను తయారు చేసారు. ...
*బాల్యవివాహాలు అరికట్టాలి* మన రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పటికీ బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. మారుమూల గ్రామాల్లో ప్రజలు నిరక్షరాస్యులు ఎక్కువ మంది ఉన్నారు. బాల్యవివాహాలు వల్ల కలిగే నష్టాలు తెలియకపోవడం వల్ల పలు గ్రామాల్లో ఇప్పటికీ బాల్యవివాహాలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని చోట్ల ఆడపిల్లలకు బలవంతంగా వివాహం జరిపిస్తున్నారు. చదువు మాన్పించి బాల్యవివాహాలు చేసేస్తున్నారు కొందరు అజ్ఞాన గిరిజనులు . ఈ ప్రాంతాలను అధికారులు ప్రజాప్రతినిధులు సరిగ్గా పట్టించుకోవడం లేదు. పదవతరగతి పూర్తి కాకుండానే కొందరికి పెళ్ళిళ్ళు జరిగిపోతుంటే, పదవతరగతి పూర్తికాగానే మరికొందరి వివాహాలు జరిగిపోతున్నాయి. 18 ఏళ్ళు నిండిన తర్వాతే పెళ్లి జరగాలి. కానీ మన్యం లో ఇలా జరగడం లేదు. అతి తక్కువ వయస్సులోనే పిల్లలను కంటున్నారు. దాని వల్ల తల్లికి, బిడ్డకి ఇద్దరికీ కూడా ప్రమాదమే. అంతే కాకుండా మహిళల పై అత్యాచారాలు ఏజెన్సీ ప్రాంతాల్లో చోటు చేసుకుంటున్నాయి. బాధితులు నిరక్షరాస్యులు, నిరుపేదలు, చట్టాలపై అవగాహన లేని వారు కావడంతో కామాంధుల వేషాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. నలుగురు లో పరువు పోగొట్టుకోవడం కన్నా మౌనంగా ఉండటమే మేలు అనే...
*ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయం ఇంగ్లీషు మీడియం పై నా ఆలోచన* అన్ని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం పెట్టండి కానీ.... ఓ తెలుగు తల్లి బిడ్డ గా నా అభిప్రాయాలుకు విలువ ఇవ్వండి *ఇది ఒక పరిష్కారం అవుతుందని భావించండి* ఇది తెలుగు వాడిగా నా డిమాండ్ పాఠశాలలో తెలుగు ఒక సబ్జెక్టు గా మాత్రమే కాదు..... ప్రతి పాఠశాలలో ఖచ్చితంగా తెలుగు మాత్రమే మాట్లాడాలని నిబంధనవిధించచండి. పాఠశాల లో తెలుగు తనం కనిపించేలా చెయ్యండి. పాఠశాల పేరు, అన్ని రికార్డులు తెలుగు లోనే ఉండాలి. ఇకపై ఈ ఆంధ్ర దేశంలో ఎక్కడకు వెళ్లినా తెలుగు కనిపించాలి. షాపు ల పేర్లు కూడా ఖచ్చితంగా తెలుగు లో ఉండేలా చేయండి. ప్రతి విద్యార్థి కి తెలుగు అవసరం అడుగడుగునా కనిపించాలి. అప్పుడే తెలుగు భాష అంతరించిపోకుండా ఉంటుంది. నేను తెలుగు మీడియం లో ఇంగ్లీషు ఒక సబ్జెక్టు గా చదివాను. ఇంగ్లీషు అవసరం కూడా అంతంత మాత్రంగా ఉంది కాబట్టి నేను ఇంగ్లీషు ని నెగ్లెట్ చేసాను. కొందరు ఇంగ్లీషు మీడియం మితృలు "మాకు అస్సలు తెలుగు రాదు" అన్నట్లు ప్రవర్తించిన తీరు నేను ఎప్పటికీ మర్చిపోలేను. తెలుగ...
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి